గౌలీపేటలో దారుణం
కర్నూలు : కర్నూలుజిల్లా ఆదోనిలోని గౌలిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబం గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా నివాసం ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తి భార్య కుమార్తె గొంతుకోసి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గమనించిన ఇరుగుపొరుగు వారు వీరిని ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిని పరీక్షించిన వైద్యులు విజయ్ కుమార్ భార్య, కూతురు మృతిచెందినట్లు నిర్థారించారు. విజయ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 2 June, 2009
|