రోడ్డు ప్రమాదంలో ఎఎస్ఐ మృతి
నెల్లూరు : పారిపోతున్న దొంగను పట్టుకోబోయిన పోలీసు జీపు ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు ఓ దొంగ మృతి చెందాడు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి మండలం ముద్దూరుపాడు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. చోరీకి పాల్పడిన దొంగను పట్టుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ను పోలీస్ జీపు ఢీ కొట్టింది. దీంతో ఎ.ఎస్.ఐ కృష్ణారావు, హోంగార్డు బాలయ్య, కానిస్టేబుల్ దేవయ్య, దొంగ వసంతరావులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు శాఖపరమైన సహాయం అందచేస్తామని ఎస్పీ తెలిపారు.
News Posted: 3 June, 2009
|