ఏసీబీ వలలో ఎస్సై
ఏలూరు : ఓ కేసు నిమిత్తం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏలూరు త్రీటౌన్ ఎస్సై రామారావు, కానిస్టేబుల్ మధు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా త్రీటౌన్ ఎస్సై ఓ కేసు నిమిత్తం అయిదు వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దాంతో రంగంలోకి దిగిన ఏబీసీ అధికారులు లంచం తీసుకుంటున్న ఎస్సైతోపాటు కానిస్టేబుల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 5 June, 2009
|