అనంతపురం : అనంతపురం జిల్లా గుత్తి మండలం గాజులపల్లెలో టిడిపి - కాంగ్రెస్ వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ పోరుకు సంబంధించిన వివారాలు తెలియరాలేదు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.