వరంగల్ : హైదరాబాద్ నుండి వరంగల్ కు వచ్చే పుష్ పుల్ ఎక్సె ప్రెస్ లో మంటలు చెలరేగాయి. నల్గొండ జిల్లా రాయగిరి వద్ద ఈ ప్రమాదం సంభవించింది. రైలులో మంటలు రేగడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు లోనై పరుగులు తీశారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.