కడప : ఎర్ర చందనం అక్రమ రవాణాను నిరోధించడానికి అటవీశాఖ కొత్త మార్గాలను ఎంచుకోనుంది. పర్యాటకులకు అడవి అందాలను చూపించడం ద్వారా ఎర్రచందనాన్ని కాపాడు కోవచ్చని వారు భావిస్తున్నారు. ఏకో టూరిజంపై అటవీ శాఖ దృష్టి సారించింది. రాజం పేట డివిజన్ లో ఇప్పటికే రెండు చోట్ల పర్యాటకులను ఆకర్షించే విధంగా టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సోమశిల బ్యాక్ వాటర్ పై దృష్టి నిలిపారు. సుమారు రూ.30 లక్షలతో పర్యాటకులను కనువిందు చేసే సోమశిల వెనుక జలాల అందాలను చూపించనున్నారు. ఈ మేరకు డీఎప్ఓ వై.శ్రీనివాసుల రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే ఒక్కొక్కటి రూప.10 లక్షలు విలువ చేసే రెండు బోట్లు కొనుగోలు చేయనున్నారు. వీటిల్లో ఒక్కో దానిలో 40 మంది పర్యాటకలు కూర్చొనే సదుపాయం ఉంటుంది. సోమశిల వెనుక జలాల్లో బోటు సఫారీ చేయడానికి ఎంతో మంతి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం.