గుంటూరు : రాష్ట్రంలోని పలు జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా చోడవరంలోని శ్రీ లక్ష్మీ రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో వారికి 181 క్వింటాళ్ళ ధాన్యంతో పాటు 10 క్వింటాళ్ళ బియ్యం లభించడంతో వాటిని సీజ్ చేశారు.