జిల్లాలో విజిలెన్స్ దాడులు
కరీనంగర్ : రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గోడౌన్స్ లలో పెద్ద మొత్తంలో అక్రమంగా దాచిన అపరాలతో, పాటు బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం అందడంతో విజిలెన్స్అధికారులు దాడులు నిర్వహించారు. కరీనంగర్ జిల్లా మెట్ పల్లిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్స్ పై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా ఐదు లక్షలు విలువ చేసే పప్పు, ధాన్యాలు లభించడంతో వాటిని సీజ్ చేశారు.
News Posted: 6 June, 2009
|