మత్తుమందు ఇచ్చి దుండగుల దోపిడి
వరంగల్ : కొందరు వ్యక్తులు తోటీ ప్రయాణీకులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిని నమ్మించి తమపై సదభిప్రాయాన్ని కలిగించారు. తదుపరి మత్తు మందు కలిపిన పదార్ధాలను ఇచ్చి దోపిడీకి పాల్పడిన సంఘటన ఖాజీపేట జంక్షన్ లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న సంపర్క్ ఎక్స్ ప్రెస్ లోసంభవించింది. తాము ఇచ్చిన పదార్థాలను తిన్న వ్యక్తులు సృహ కోల్పోవడంతో వారి వద్ద ఉన్న ఆభరణాలు, సొమ్ములు తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ సంఘటనతో తోటి ప్రయాణీకులు రైల్వే అధికారులకు తెలియజేయడంతో స్పృహ కోల్పోయిన వారిని ఎంజీఎంకు తరలించారు. కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News Posted: 8 June, 2009
|