గుంటూరు : కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందిన ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటనను గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ తల్లితోసహా ఓ కూతురు ప్రాణాలుకోల్పోగా మరో ఇద్దరి పిల్లల పరిస్థితి ఆందనళకరంగా ఉందని వైద్యులు తెలిపారు.