కర్నూలు : కర్నూలులోని సుంకేశుల రిజర్వాయర్ నీటిమట్టం పెరగడంతో అధికారులు రిజర్వాయర్ ఏడు గేట్లను ఎత్తివేశారు. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగభద్రకు వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో సుంకేశులలో నీటిమట్టం 34 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.