వరంగల్ : యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీతకు అమెరికాలో వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించనున్నట్లు `తానా' ప్రకటించింది. ప్రణీత ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ యాసిడ్ దాడిలో కాలిపోయిన శరీరం సాధారణ స్థాయికి రావడానికి సంవత్సరం పైగా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకూ ప్రతీ వారం ఆమెకు క్రమం తప్పకుండా చికిత్స చేయలసి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇదంతా వ్యయప్రయాసలతో కూడినదైనప్పటికీ బాధితురాలు ఆత్మవిశ్వాసంతో ఈ పరిస్థితి ఎదుర్కోవాలని డాక్టర్లు ఆమెకు సూచించారు. ప్రణీతకు చేయూతను అందించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు రావడంతో ప్రణీతకు అమెరికాలో చికిత్స చేస్తామని వారు ప్రకటించారు.