సుమో,లారీ ఢీ:పెళ్లికొడుకు మృతి
కడప : జమ్మలమడుగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్ళికొడుకు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలముడుగు మండలం నుండి పెళ్ళివారు ప్రయాణిస్తున్న సుమోను దుత్తలూరు వద్ద లారీ ఢీ కొంది. దీంతో పెళ్ళికొడుకు రాంగణేష్, మరో మహిళ పార్వతి దుర్మరణం పాలయ్యారు. పెళ్ళి కుమార్తె భారతితో పాటు మరో నలుగురుకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 12 June, 2009
|