కరీంనగర్ : పోలీసుల వేధింపులు తాళలేక ఓ నిందితుడు కోర్టులో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. గతంలో పలు దొంగతనాల కేసుల్లో తాను జైలుకు వెళ్ళివచ్చినట్లు తెలిపాడు. తర్వాత మంచిగా బతుకుతున్నా పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ నిందితుడు న్యాయమూర్తి ముందే యాసిడ్ సేవించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల కోర్టులో నేడు చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.