22న ఆర్మీ రిక్రూట్ మెంట్
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలు పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 22 నుంచి 28 వరకు జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి అభ్యర్థులు తరలి రావాలని యువజన సంక్షేమ శాఖ సీఈవో డా.వెలగా జోషి తెలిపారు. రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి సోల్జర్ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ట్రేడ్ మెన్, సోల్జర్ క్లర్క కేటగిరీలకు నియామకాలు జరగనున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఆయా తేదీల్లో నేరుగా హాజరుకావచ్చు.
News Posted: 12 June, 2009
|