ఎంజీఎంలో `కొండా' తనిఖీలు
వరంగల్ : వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సదుపాయాల గురించి తెలుసుకునేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్యసేవలను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు తీశారు.
News Posted: 13 June, 2009
|