స్వైన్ ఫ్లూ కలకలం
కర్నూలు : విదేశాలనుండి తిరిగొచ్చిన ఓ విద్యార్థికి స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. వెలుగోడు మండలం రేగడగూడూరుకు చెందిన రైతు రామచంద్రా రెడ్డి ఏకైక కుమారుడు హర్షవర్థన్ రెడ్డి అమెరికాలో ఉన్నత చదువుల కోసం మూడేళ్ళ క్రితం వెళ్ళాడు. సెలవులపై స్వగ్రామానికి చేరుకున్నాడు. కాగా అతనికి జలుబు, కీళ్ళనొప్పులు, దగ్గు, జ్వరం అధికం కావడంతో ఆస్పత్రికి చేర్చగా అతనికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యలు భావిస్తున్నారు. ఈ మేరకు సమాచారాన్నిడీఎంహెచ్ఓ శివశంకర్ రెడ్డి హైదరాబాద్ లోని ఛాతి ఆస్పత్రికి సమాచారం అందించారు. వారి సూచన మేరకు హర్షవర్ధన్ రెడ్డిని ఛాతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శాంపిళ్ళను సేకరించి ఢిల్లీకి పంపి వ్యాధి నిర్థారణ చేస్తారు.
News Posted: 13 June, 2009
|