కాసిరెడ్డి నాయన ఆశ్రమం ప్రారంభం
అనంతపురం : మండల పరిధిలోని మొలకవేమల క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన కాసి రెడ్డి నాయ ఆశ్రమం, ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను కలెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలన్నారు. భక్తిభావం పెంపొందించుకుంటే తద్వారా మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మొలకవేమల గ్రామానికి చెదిన డా.శంకర్ నారాయణరాజు నాలుగు ఎకరాల్లో ధ్యానమందిరం, విఘ్నేశ్వరాలయం, నిర్మించడానికి కృషి చేశారు. ఇంకా వృద్ధాశ్రమం, ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కాసి రెడ్డి నాయన ఆశ్రమంలో నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాసి రెడ్డి నాయన సేవాదళ్ సభ్యులను కలెక్టర్, ఎస్పీలు అభినందించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
News Posted: 13 June, 2009
|