బడికి పంపించండి : సురేఖ
(వేముల సదానందం)
వరంగల్ : సమాజంలోని ప్రతి ఒక్కరు పిల్లను బడికి పంపించి చదువు చెప్పించడం ఒక సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర స్త్రీ అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు. బడిబాట ర్యాలీని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బటి బయట పిల్లలను, డ్రాపవుట్ విద్యార్థులను తప్పనిసరిగా బడిలో చేర్పించేందుకు కృషి చేస్తామని తెలుపుతూ విద్యార్థులు,అధికారులచేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. చదువువల్ల కలిగే ఉపయోగాలను, పరపతిని, సంపదను, విజ్ఞాన సంపదను దృష్టిలో ఉంచుకుని పిల్లలను చదివించాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాకాటి కరుణ, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీరాంరెడ్డి, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి శరవణన్, జిల్లా విద్యా శాఖాధికారి లక్ష్మారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News Posted: 15 June, 2009
|