మెరుగైన సేవలు అందించండి
(వేముల సదానందం)
వరంగల్ : ఎంజిఎం ఆస్పత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. ఆమె ఎంజిఎం ఆస్పత్రికి తనిఖీలు నిర్వహించి రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సానిటేషన్ పనుల నిర్వహణ బాగాలేదని, సంబంధిత కాంట్రాక్టర్ ను పిలిచి సానిటేషన్ పనులు మెరుగుపరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. టి.బి.ఆసుపత్రికి సంబంధించి కొత్త భవన నిర్మాణానికి 12.5 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి పర్యవేక్షకులు సురేందర్ టిబి హాస్పిటల్ ఆర్.ఎం.ఓ సాంబశివరావు, డాక్టర్లు పాల్గొన్నారు.
News Posted: 15 June, 2009
|