స్టేట్ బ్యాంక్ లో చోరీకి యత్నం
కర్నూలు : స్టేట్ బ్యాంక్ లో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు అలారం మోగడంతో పరారయ్యారు. కర్నూలులోని స్టేట్ బ్యాంక్ లో చోరీకి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యార్డ్ బ్రాంచ్ లోకి కిటికీ ఊచలు వంచి లోపలకు ప్రవేశించిన దుండగులు అలారం వైర్ ను తొలగించారు. దోపిడీకి ప్రయత్నిస్తున్నప్పుడు అలారం వైర్ ను తొలగించినా అది మోగడంతో వారు పారిపోయారు. బ్యాంక్ సిబ్బంది, అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News Posted: 17 June, 2009
|