రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి
గుంటూరు : గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. బెల్లంకొండ మండలం అనుపాలెం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. రెంటచింతలకు చెందిన వీరంతా నంబూరు దర్గాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
News Posted: 19 June, 2009
|