గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీ పనిచేయక శుక్రవారం ముగ్గురు మరణించారు. శ్వాసకోశవ్యాది కారణంగా వైద్యం కోసం ముగ్గురు రోగులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఏసీ చెడిపోయింది. దాన్ని బాగుచేయించాలని వారు కోరుతున్నా ఫలితం లేకపోయింది. ఏసీ పనిచేయక శ్వాసకోశ వ్యాది తీవ్రమవటంతో ముగ్గురు రోగులు మృతి చెందారు.