కోర్టులో కొండా సురేఖ
వరంగల్ : ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా పోటీ చేసిన ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై స్వయంగా ఆమె హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఆమె కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. కేసును ఈనెల 25కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కాగా, తదుపరి విచారణ నుంచి హాజరు నుంచి మినహాయించవలసిందింగా సురేఖ తరపున్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
News Posted: 19 June, 2009
|