విషజ్వరాలతో ప్రజలు విలవిల
అనంతపురం : అనంతపురం జిల్లా కందుర్పి మండల పరిధిలోని కొలిమిపాళ్యంలో వారం రోజులుగా గ్రామస్థులు విషజ్వరాల భారిన పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మంచం పట్టారు. కల్పన అనే విద్యార్థిని డెంగ్యూతో మృతి చెందగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. కుందుర్పి ప్రభుత్వాసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పుత్రులను ఆశ్రయిస్తున్నారు. విషజ్వరాలు, అతిసార వ్యాధులు ప్రబలడానికి కలుషిత నీరే కారణమని గ్రామస్థులు తెలిపారు. నడిబొడ్డున ఉన్న తాగునీరు ట్యాంక్ ను, పంచాయితీలోని ట్యాంకులను ఆరు నెలలకు ఓ సారికూడా శుభ్రం చేయడంలేని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
News Posted: 19 June, 2009
|