లాసెట్ టాపర్ సాయిబాబా
నిజామాబాద్ : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జూన్ 3న నిర్వహించిన లాసెట్ 2009 ఫలితాలను గురువారం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.ప్రభాకరరావు విడుదల చేశారు. మూడేళ్ళ కోర్సులో నిజామాబాద్ కు చెందిన వి.సాయిబాబా మొదటి ర్యాంక్ సాధించగా, చెన్నైకు చెందిన జి.వెంకట రెండవ ర్యాంక్ ను, విజయనగరం జిల్లాకు చెందిన పి.కృష్ణమూర్తి మూడో ర్యాంక్ ను సాధించారు. ఐదేళ్ళ కోర్సులో మొదటి మూడు ర్యాంకులు వరుసగా హైదరాబాద్ కు చెందిన దివ్యమారుతి, సి.శ్రీనివాస్, ఆత్రేయ, కె.త్రిశాలా కైవసం చేసుకున్నారు.
News Posted: 19 June, 2009
|