ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
ఒంగోలు : ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నేడు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం అయింది. ఈర్యాలీని 22 నుండి 28 వరకు నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ఓసీ అభ్యర్థులను కూడా కుల ధ్రువీకరణ పత్రాలను అడగడంతో ర్యాలీలో పాల్గొనకుండానే వందలాది మంది అభ్యర్థులు వెనుదిరిగారు. ఈ ర్యాలీలో ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన యువకులు పాల్గొన్నారు.
News Posted: 22 June, 2009
|