అనంతపురం : ఏడో నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైకోర్టు లాయర్ ఐవీఎన్ రావు మృతి చెందారు. హైదరాబాద్ నుండి బెంగళూర్ కు కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లాయర్ తోపాటు కారు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.