దుర్గాబాయ్ శత జయంతి ఉత్సవాలు
రాజమండ్రి : స్థానిక ఆనం కళాకేంద్రంలో కందుకూరి వీరేశలింగం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం దుర్గాబాయ్ దేశ్ ముఖ్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోమంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మహిళా ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన దుర్గాబాయ్ మహిళా లోకానికి ఆదర్శప్రయామని ఆమె పేర్కొన్నారు. మహిళలు దుర్గాబాయి రచనల ద్వారా స్ఫూర్తి పొందవలసింది ఎంతో ఉందన్నారు. కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి పళ్ళం రాజు, రాష్ట్ర మంత్రులు బొత్సా సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, కొండా సురేఖ, దానం నాగేంద్ర, పితాని సత్యనారాయణ, మాణిక్యవర ప్రసాద్, శత్రుచర్ల విజయరామరాజు తదితరులు దుర్గాబాయ్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
News Posted: 24 June, 2009
|