మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
శ్రీశైలం : మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సరైన వర్షాలు కురవక పోవడంతో వర్షాలు కురవాలనే సంకల్పంతో గురువారం తెల్లవారుజామున వైభవంగా ఈ అభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ముందుగా మహాగణపతి పూజ చేశారు. మల్లికార్జున స్వామికి తెల్లవారుజామున ప్రాత:కాల పూజల అనంతరం మహాసంకల్పం చేసి 1008 కలశాలతో మండపారాధన చేసి మహన్యాసపారాయణ రుద్రమంత్రాలతో సహస్ర ఘటాభిషేక మహోత్సవం ప్రారంభం అయ్యింది. ఈ ఘటాభిషేక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. కాగా స్వామివారికి సాయంత్రం జరిగే కళ్యాణమహోత్సవం యథావిధిగా నిర్వహిస్తారు. గత రెండురోజులుగా ఆలయ ప్రాంగణంలో వేదపండితులు వర్షాల రాక కోసం వరుణసూక్తపారాయణలు, రుద్రపారాయణ, పురుషసూక్తపారాయణలతోపాటు పంచాక్షరీ జపాన్ని ఏకధాటిగా నిర్వహిస్తున్నారు.
News Posted: 25 June, 2009
|