29 నుంచి పరుగు పరీక్షలు
వరంగల్ : వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయంలో ఈనెల 29 నుంచి ఐదు కిలోమీటర్ల పరుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పి వి.సి.సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ కానిస్టేబుళ్ళ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఐడెంటీ కార్డులతో సోమవారం ఉదయం ఐదు గంటలకే హాజరు కావాలని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన టోకెన్ నెంబర్ల ప్రకారంగా నిర్ణీత తేదీలలో తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు. పరుగెత్తే సమయంలో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆగిపోవచ్చనీ, అభ్యర్థిని దాటిపోవాలనే తలంపుతో కాకుండా ప్రణాళికాబద్ధంగా పరిగెత్తితే విజయం సాధించవచ్చని ఆయన ఆభ్యర్థులకు సూచించారు.
News Posted: 25 June, 2009
|