రైతులకు కొత్త రుణాలు
అనంతపురం : ఖరీఫ్ సీజన్ లో రైతులకు కొత్త రుణాలు మంజూరు చేస్తున్నట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకులు (జేడీఏ) ఫహీమ్ వెల్లడించారు. ఆయన స్థానికి ఏడీఏ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ప్రతి బ్యాంకు బ్రాంచిలోనూ 350 మంది రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు అంగీకరించారని తెలిపారు. రైతులందరికీ వేరుశనగ విత్తన కాయలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డివిజన్ కేంద్రంలో మాత్రమే విత్తన పర్మిట్లు మంజూరు చేస్తామని, స్టాక్ మాత్రం కేంద్రాల్లోనే ఇస్తామని ఆయన తెలిపారు. విత్తనాలు, ఎరువులకు ఎటువంటి సమస్యా లేదన్నారు. ఎరువుల దుకాణాదారులు ధరలు, స్టాక్ బోర్డులు, ఏర్పాటు చేయాలని, రైతులకు కచ్చితంగా రసీదులు ఇవ్వాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ సీడ్స్ ద్వారా వరి విత్తనాన్ని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. రైతులు ఆగస్టు 31 లోగా రుణాలను రెన్యువల్ చేయించుకుంటే భీమా వర్తిస్తుందని రైతలకు తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఏ జ్ఞానేశ్వర్ రావు, ఏఓలు పాల్గొన్నారు.
News Posted: 25 June, 2009
|