విజిలెన్స్ దాడుల్లో ధాన్యం సీజ్
కర్నూలు : కర్నూలు జిల్లాలో గోదాములపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బనగానపల్లి బిఎంఆర్ ఫార్మ్ వేర్ హౌస్ గోదాముల్లోనూ, చాగల మర్రి, ఆళ్లగడ్డ మండలాల్లో, మర్రి మండలం ముత్యాలపాడులోని లక్ష్మీ సాయిరాం వేర్ హౌస్ లో విజిలెన్స్ డిఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో గోదాముల్లో నాలుగుకోట్లు విలువచేసే వరిధాన్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా గోదాముల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యాలపై విజిలెన్స్ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
News Posted: 26 June, 2009
|