కలకలం రేపిన భార్యాభర్తలు
కరీంనగర్ : కుటుంబ కలహాలతో దంపతులు సెల్ టవర్ ఎక్కి స్థానికుల్లో కలకలం సృష్టించారు. ఆస్తి పంపకాల్లో తమకు వస్తుందనుకున్న వాటా రాక, అప్పులు బాధ తీరే మార్గం కనపడక ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే టవర్ పై నుంచి కిందకు దూకుతామని వీరిరువురూ బెదిరింపులకు దిగారు. భార్య వాటర్ ట్యాంకర్ ఎక్కగా, భర్త సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో స్థానికుల్లో కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామపెద్దలు వారిద్దరికీ సర్ది చెప్పడంతో దంపతలు టవర్ పై నుంచి కిందకు దిగి వచ్చారు.
News Posted: 29 June, 2009
|