ఒంగోలు : ఓ రైతు నుంచి అయిదువేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు గిద్దలూరు సర్వేయర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. బాదితుని ఫిర్యాదు మేరకు గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనికీల్లో సర్వేయర్ అల్లూరయ్య లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.