ప్రజావాణిలో కలెక్టర్
(వేముల సదానందం)
వరంగల్ : ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నెడిమెట్ల శ్రీధర్ ప్రజల నుండి 129 అభ్యర్థనలను స్వీకరించారు. వివిధ సమస్యలతో హాజరైన ప్రజలు ఎక్కువగా పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల గురించి ధరఖాస్తు చేసుకున్నారు. చీటురు గ్రామనివాసి చిలుపూరం భాస్కర్ అనే వికాలంగ యువకునికి ట్రై సైకిల్, ఫించనను మంజూరు చేయలసిందిగా వికాలాంగుల శాఖాధికారిని ఆదేశించారు. రాజీవ్ ఉద్రోగశ్రీ కింద ఉద్యోగం కల్పించవలసిందిగా గీసుకొండ, రేగొండ గ్రామాలకు చెందిన అభ్యర్థులు కోరగా అర్హతలు పరిశీలించి శిక్షణ ఇవ్వవలసిందింగా సూచించారు. ఆపద్బందు పథక కింద ఆర్థిక సహాయం కోసం, హాస్టల్లో వసతి కోసం మహిళలు, బాలికలు కోరగా వారికి ఉపయుక్తంగా ఉండే విధంగా తగిన చర్యలను తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వితంతువు, వికలాంగుల ఫించన్లకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీరాంరెడ్డి, ఎ.ఓ మధుసూదన్, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
News Posted: 30 June, 2009
|