కలెక్టర్ కు సమస్యల విన్నపం
అనంతపురం : అనంతపురం జిల్లాకు కొత్తగా నియమితులైన బి జనార్థ్ రెడ్డికి రెవెన్యూ భవనంలో జరిగిన గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులతో స్వాగతం పలికింది. కొత్త కలెక్టర్ కు తమ సమస్యలు విన్నవిస్తే న్యాయం జరుగుతుందన్న ఆశతో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేత పట్టుకుని ఆయన వద్దకు వచ్చారు. కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి అందులోని సమస్యలకు సంబంధించిన అధికారులను పిలిపించి అక్కడికక్కడే మాట్లాడారు. త్వరలోనే అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. అర్జీ దారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడే తీరును గమనించిన ప్రజలు ఆయన ఎంతో మంచివారంటూ కితాబు నిచ్చారు. తమ సమస్యలు తీరే రోజు ఎంతో దూరం లేదని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
News Posted: 30 June, 2009
|