పిల్లలతో తండ్రి ఆత్మహత్య
అనంతపురం : కుటుంబ కలహాలు తట్టుకోలేని ఓ తండ్రి ఇద్దరు పిల్లలతో సహా రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో బుధవారం తన ఇద్దరు పిల్లలతో సహా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. గత రెండు, మూడు రోజులుగా ఈ కలహాలు తారాస్థాయికి చేరుకోవడంతో మృతుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనతో స్థానికంగా విషాదం నెలకొంది.
News Posted: 1 July, 2009
|