7న అంధుల చెస్ పోటీలు
అనంతపురం : అంధుల కోసం రాష్ట్ర స్థాయిలో చదరంగ పోటీలు అనంతపురంలో మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. జిల్లా అభివృద్ధికి కృషి చేసిన ఫాదర్ ఫెర్రర్ స్మారకార్థం మొట్టమొదటి సారిగా అంధుల చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రతిభా హ్యాండిక్యాపుడ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అధ్యక్షులు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ చెస్ పోటీలు అరుదైన పోటీలుగా నిలవనున్నాయన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషి చేస్తే అంధులనైనా విజయం వరించి తీరుతుందని ఆయన అన్నారు. నేటి యువతరానికి అంగవైకల్యం అవరోధం కాదని చాటి చెప్పేలా ఈ చెస్ పోటీల్లో పాల్గొనాలని అంధులకు పిలుపునిచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా జులై 7 నుంచి 9 వరకు జరిగే ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలని ఆయన అంధులను కోరారు.
News Posted: 1 July, 2009
|