తానాకు జేఎన్ టీయూ బృందం
కాకినాడ : ఆంధ్రదేశానికీ అమెరికాకూ మధ్య సాంస్కృతిక వారధిలా నిలుస్తూ అతి పెద్ద తెలుగు పండుగగా గుర్తింపు పొందిన తానా సభలకు కాకినాడ జేఎన్ టీయూ డైరెక్టర్లకు ఆహ్వానం లభిచింది. ఈ నేపథ్యంలో జేఎన్ టీయూ డైరెక్టర్లు డా.ప్రభాకరరావు, డా.ఉదయభాస్కర్ లు చికాగోకు బయలుదేరివెళ్ళారు. రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ తానా సభల్లో వారు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రభాకరరావు ఎంబీఏ ప్రాగ్రాంను ప్రారంభించే విషయమై తానా సభలో చర్చించనున్నారు. అదే విధంగా పిట్స్ బర్గ్ వర్శిటీతో ఫార్మసీ పీజీ ప్రోగ్రామ్స్, పరిశోధనలపై చేసుకోనున్న ఒప్పందం గురించి కూడా ఆయన చర్చించనున్నారు. లాస్ వేగాస్ జరగనున్న ప్రపంచ సదస్సులో వైర్ లెస్ సెట్ పై ప్రభాకర్, ఇమేజ్ ప్రోసెసింగ్ అండ్ కంప్యూటర్ విజన్ పై ఉదయభాస్కర్ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు.
News Posted: 1 July, 2009
|