భార్య, కూతురిపై యాసిడ్
గుంటూరు : ఆవేశంలో నిగ్రహాన్ని కోల్పోయిన ఓ తండి కన్న కూతురిపైనా, కట్టుకున్న భార్యపైనా యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి తల్లీ కూతుళ్ళను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఎలమందలో గురువారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలైన బుల్లయ్య, శివపార్వతిల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కాగా 20 రోజుల్లో గుంటూరు జిల్లాలో వరుసగా ఇది నాలుగో యాసిడ్ దాడి జరగటం బాధకంరగా ఉందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 2 July, 2009
|