కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ లో గురువారం నాడు ఆర్టీసి బస్సు ఓ చెట్టును ఢీ కొనడంతో 23 మంది ప్రయాణీకులు గాయాలపాలయ్యారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వేగంగా వస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.