ఆదోని వైద్యునికి లండన్ అవార్డ్
కర్నూలు : ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధ చికిత్స అధ్యనంపై లండన్ లోని మిడిల్ చెక్స్ యూనివర్శిటీ ఆన్ లైన్ లో నివేదికలు ఆహ్వానించారు. మన దేశం నుంచి పదుల సంఖ్యలో వైద్యులు నివేదికలు పంపగా, లండన్ యూనివర్శిటీ ముగ్గురుని ఎంపిక చేసింది. వారిలో ఆదోని సాయి నర్సింగ్ హోం వైద్యుడు ఎ చంద్రశేఖర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను అవార్డు అందుకునేందుకు 8వ తేదీన యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ మైఖేల్ ప్రెస్ కాల్ ఆహ్వానం పంపిందన్నారు. ఈ అవార్డును తీసుకునేందుకు చంద్రశేఖర్ 5న లండన్ వెళుతున్నట్లు చెప్పారు.
News Posted: 2 July, 2009
|