గుంటూరు : సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ప్యాసింజర్ రైల్ కు ఆటంకం ఏర్పడింది. దీంతో పిడుగురాళ్ళ మండలం తుమ్మలపాలెం వద్ద రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్లో సాంకేతిక లోపం ఉన్నట్లు సకాలంలో గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.