తల్లీ, పిల్లలు దుర్మరణం
ఒంగోలు : కూలీ పనులకోసం ఒంగోలుకు ఆటోలో వస్తున్న ఓ కుటుంబం మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పెదారికట్లకు చెందిన వెంకటరమణమ్మ తన ముగ్గురుపిల్లలతో కలిసి కూలీ పనులకోసం ఒంగోలుకు ఆటోలో వస్తుండగా ఎదురుగా వచ్చిన గ్రానైట్ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణీకులను ఆసుపత్రిలో చేర్చారు.
News Posted: 4 July, 2009
|