ఆటో లారీ ఢీ
గుంటూరు : జిల్లాలోని పెదనెమళ్ళపూడి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండల పెదనెమళ్ళపూడి వద్ద ఆటోనూ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 6 July, 2009
|