ఉపేక్షించేది లేదు : కలెక్టర్
(వేముల సదానందం)
వరంగల్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అంకింత భావంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. డిప్యూటీ, ఏఇలు తమ తమ హెడ్ క్వార్టర్స్ లోనే అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. . అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు, బాధ్యదాయుతంగా పనిచేయనివారు స్వచ్ఛందంగా తప్పుకోవాలనీ, లేక పోతే తగు చర్చలు తీసుకోనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు సుమారుగా 3 కోట్ల 50 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నందున వాటిని పదిరోజులలోగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 38 అసిస్టెంటు ఇంజనీర్ల పోస్టులను వారం లోగా భర్తీ చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్.సి, ఎస్.టి వర్గాల లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం బ్రిడ్జి రుణాలతో వారుఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునే విధంగా గ్రామాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలునిర్వహించాలని ఆయన సూచించారు. కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ సమావేశంలో హౌసింగ్ జిల్లా మేనేజర్ విజయ్ కుమార్, ప్రత్యేక అధికారి విజయగోపాల్, డిఆర్ డిఎ ప్రాజెక్టు అధికారి దామోదర్ చౌదరి, ఎల్ డియం తదితరులు పాల్గొన్నారు.
News Posted: 6 July, 2009
|