రమ్య మృతిపై ఆర్డీఓ విచారణ
వరంగల్ : సెయింట్ జాన్స్ ఫార్మసీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రమ్య మృతిపై ఆర్డీఓ విచారణ ప్రారంభమైంది. రమ్య, ధ్వనిలు సోమవారం కాలేజీకి ఆలస్యంగా వెళ్ళడంతో ప్రిన్సిపాల్ మందలించారు. ఈ కారణం వల్లే మనస్థాపానికి గురైన వారు నెయిల్ పాలీష్ రిమూవర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా రమ్య మృతి చెందిందని రమ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో రమ్య మృతిపై కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో పోలీసులు సెయింట్ జాన్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బుధవారం ఆర్డీఓ కళాశాలలో విద్యార్థుల ద్వారా విచారణ ప్రారంభించారు.
News Posted: 8 July, 2009
|