విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి
కర్నూలు : విద్యార్థినులపై ఉన్మాదుల దాడులకు అంతం లేకుండా పోతోంది. తనను ప్రేమించలేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు సుచిత్ర అనే విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న అవి నామమాత్రంగా ఉంటున్నాయనేది తేటతెల్లమవుతుంది. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో సుచిత్ర అనే యువతిపై ఓ ప్రేమోన్మాది దాడి తెగబడ్డాడు. ఎమ్మిగనూరుకు చెందిన సుచిత్ర కోచింగ్ క్లాసులకు వెళ్లి వస్తుండగా ఈ దారుణం జరిగింది. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 8 July, 2009
|