గుంటూరు : స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో స్కార్పియో అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని కడప జిల్లా తొండూరు మండలానికి చెందినవారుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో కారు వాగులోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.